మారుతి గ్రాఫ్ పెరిగిందా?

నిజం చెప్పాలంటే డైరెక్టర్ మారుతికి గ్యాప్ పెరిగింది. ‘ప్రతిరోజూ పండగే’ సినిమా విజయం తర్వాత ఒక పెద్ద హీరో కోసం అంటూ నిరీక్షించి టైం వేస్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా “పక్కా కమర్షియల్” అనే మూవీ ఒకటి మొదలు పెట్టగానే కరోనా వచ్చింది. దాంతో రెండేళ్లుగా ఆ సినిమా అలా సాగుతూనే ఉంది.

గ్యాప్ లో ‘మంచి రోజులొచ్చాయి’ అనే చిన్న చిత్రం తీశారు. ఐతే, ఇన్నాళ్ల నిరీక్షణకి ఫలితం దక్కినట్లు కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్… ఇద్దరూ మారుతితో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఐతే, మారుతి మాత్రం తన తదుపరి చిత్రాల గురించి ఊహాగానాలు వద్దు అని మీడియాని కోరుతున్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని చెప్తాను అంటున్నారు.

నిజంగా ప్రభాస్ కానీ మూవీ ఛాన్స్ ఇస్తే మారుతీ రేంజ్, గ్రాఫ్ పెరిగినట్లే. కాకపోతే, “యు ఆర్ ఇన్ క్యూ”లా ప్రభాస్ సినిమాల లిస్ట్ పెద్దది. మారుతి టర్న్ ఎప్పుడొస్తుందో!

Advertisement
 

More

Related Stories