హీరోయిన్ కీర్తి సురేష్ కూడా వ్యాక్సిన్ వేయించుకొంది. ఆమె ఈ రోజు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకొంది. కీర్తి సురేష్ కి 28 ఏళ్లు. ముంబై, చెన్నై, బెంగళూరులలో 18-45 ఏళ్ళ వయస్సు వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఎక్కువగా ప్రైవేట్ ఆసుపత్రిల్లో అక్కడ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే నయనతార వంటి హీరోయిన్లు వ్యాక్సిన్ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లో వ్యాక్సిన్ల కొరత ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ సెలబ్రిటీలకు, విఐపీలకు వయసుతో సంబంధం లేకుండా వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on May 22, 2021 9:00 pm