Advertisement
తెలుగు న్యూస్

సింగర్ మధుప్రియకు వేధింపులు


గుర్తుతెలియని కొందరు తనని ఫోన్ లో వేధిస్తున్నారని గాయని మధుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిత్యం వారి నుంచి కాల్స్ వస్తున్నాయని, మానసికంగా వేధిస్తున్నారని ఆమె సైబర్ క్రైం పోలీసులకు మెయిల్ చేశారు. వెంటనే కేసు నమోదు చేసి ఆ కేసుని ‘షీ టీమ్స్’కి అప్పగించింది సైబర్ క్రైం టీం.

కాల్స్ లిస్ట్ ఆమె పోలీసులకు అప్పగించారు. ‘షీ టీమ్స్’ రంగంలోకి దిగింది.

‘ఫిదా’ సినిమాలో “వచ్చిండే..”, సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో “హి ఈజ్ సో క్యూట్” వంటి సూపర్ హిట్ సాంగ్స్ పాడిన గాయని మధుప్రియ. ఆమెకి విపరీతమైన క్రేజ్ ఉంది.

Advertisement

This post was last modified on May 22, 2021 6:53 pm

Advertisement
Share