మొగల్తూరులో వైద్య శిబిరం

స్వర్గీయ కృష్ణంరాజు గారి జయంతి వేడుకలు ఈ నెల 20వ తేదీన మొగల్తూరులో నిర్వహించనున్నారు. కృష్ణంరాజు గారి సతీమణి శ్యామలాదేవి, కూతురు ప్రసీద, ప్రభాస్ ఈ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

స్థానిక శ్రీ అందే బాపన్న కళాశాల ఈ ఉచిత వైద్య శిబిరానికి వేదిక. డాక్టర్ వేణు కవర్తపు ట్రస్టీగా ఉన్న యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనుంది ఈ శిబిరం. ఈ వైద్య శిబిరంలో జుబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి డాక్టర్ శేషబత్తారు, భీమవరంలోని వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి డా.వర్మ పాల్గొంటారు.

ఈ ఉచిత వైద్య శిబిరంలో డయాబెటిస్ తో బాధపడుతున్న స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మెడిసిన్స్, చికిత్స అందిస్తారని శ్యామలాదేవి తెలిపారు. మొగల్తూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరం సేవలను ఉపయోగించుకోవాలి ఆమె సూచించారు.

వెయ్యి మంది వరకు ఈ వైద్య శిబిరానికి వస్తారని అంచనా వేస్తున్నారు.

Advertisement
 

More

Related Stories