Advertisement
తెలుగు న్యూస్

మహేష్, సుకుమార్ చర్చ దేనికోసం?

మహేష్ బాబు నటిస్తున్న సినిమా సెట్ కి ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ వెళ్లడం టాకింగ్ పాయింట్ అయింది. హైదరాబాద్ లో ‘సర్కారు వారి పాట’ షూటింగ్ జరుగుతోంది. అదే స్టూడియోలో సుకుమార్ సినిమా కూడా నడుస్తోంది. దాంతో, సుకుమార్ మహేష్ బాబుని వెళ్ళి కలిశారు.

ఒకప్పుడు మహేష్ బాబు, సుకుమార్ మధ్య మంచి స్నేహం ఉండేది. ఐతే, ఏడాదిపాటు కథపైన కూర్చుండపెట్టి ఆ తర్వాత కథ నచ్చలేదని మహేష్ బాబు తన సినిమాని రిజెక్ట్ చెయ్యడంతో సుకుమార్ షాక్ తిన్నారు. సుకుమార్ కి నో చెప్పి పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మొదలుపెట్టారు మహేష్ బాబు. ఇక మహేష్ బాబు నో చెప్పగానే, బన్నీని అప్రోచ్ అయ్యి ‘పుష్ప’ షురూ చేసారు సుకుమార్.

ఐతే, మహేష్ బాబు, సుకుమార్ మధ్య రాజీ కుదిరి చాలా కాలం అయింది. ‘పుష్ప’ సినిమా షూటింగ్ మొదలు పెట్టకముందే సుకుమార్ మహేష్ బాబుని కలిసి ‘ప్యాచప్’ చేసుకున్నారు. అలాగే, సుకుమార్ ఇంట్లో జరిగిన ఒక ఫంక్షన్ కి కూడా మహేష్ బాబు సతీసమేతంగా వెళ్లారు. తాజాగా ‘సర్కారు వారి పాట’ సెట్ కి కూడా వెళ్లి కలిశారు సుకుమార్. ఇది మర్యాదపూర్వక కలియక. ‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు లుక్ బాగుందని సుకుమార్ అన్నాట్ట.

మరి వీరి కాంబినేషన్లో మళ్ళీ సినిమా రాగలదా అంటే ఇప్పట్లో కష్టమే అని చెప్పాలి. ఇంతకుముందు వచ్చిన ‘1 నేనొక్కడినే’ కమర్షియల్ గా ఆడలేదు. ఈసారి మహేష్ బాబుతో హిట్ సినిమా తీయాలని సుకుమార్ అనుకున్న మాట వాస్తవమే. కానీ, మహేష్ బాబు నెక్స్ట్ త్రివిక్రమ్, రాజమౌళి చిత్రాలు చేస్తారు. 2024 వరకు మహేష్ బాబు బిజీ. సుకుమార్ ‘పుష్ప’ రెండు భాగాలు పూర్తి చేసి ఆ తర్వాత విజయ్ దేవరకొండ మూవీ చెయ్యాలి.

Advertisement

This post was last modified on August 12, 2021 11:51 pm

Advertisement
Share