ఇళయరాజా స్టూడియోలో కీరవాణి రాగం

మాస్ట్రో ఇళయరాజా ఇటీవల చెన్నైలో సొంతంగా రికార్డింగ్ స్టూడియో కట్టుకున్నారు. ఆయన స్టూడియోని చూసేందుకు పలువురు సెలెబ్రిటీలు విచ్చేస్తున్నారు. రజినీకాంత్ ఇప్పటికే వచ్చి వెళ్లారు. తాజాగా ఎం.ఎం.కీరవాణి కూడా రాజా స్టూడియోకి వెళ్లి ఫోటో తీసుకున్నారు.

పని మీద చెన్నై వెళ్లిన కీరవాణి…నుంగంబాకం నుంచి వెళ్తుండగా ఇళయరాజా స్టూడియో కనిపించడంతో ఆగి అక్కడ సెల్ఫీ తీసుకున్నారు. ఆ తర్వాత స్టూడియోలోకి వెళ్లి రాజాని కలుసుకున్నారు.

ఇళయరాజా చాలా కాలం చెన్నైలోని ప్రసాద్ స్టూడియోలోనే తన పాటల రికార్డింగ్ జరిపేవారు. ఇటీవల ప్రసాద్ స్టూడియో యాజమాన్యంతో గొడవ అయింది. రాజాని వెకేట్ చేయించారు. దాంతో ఆయన సొంతంగా నుంగంబాకంలోని కామదార్ నగర్ రోడ్ లో స్టూడియో తీసుకున్నారు.

ఇళయరాజాకి కీరవాణి వీరాభిమాని. రాజాని సంగీత దేవుడిగా భావిస్తారు. కీరవాణి ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెలలోనే మొదటి పాట విడుదల కానుంది.

Advertisement
 

More

Related Stories