త్రివిక్రమ్ సినిమాలో మోహన్ బాబు!


ప్రతి సినిమాలో ఒక పేరొందిన నటుడిని విలన్ గానో, కీలకమైన పాత్రకోసమో తీసుకోవడం త్రివిక్రమ్ శైలి. అత్తారింటికి దారేది సినిమాలో తాత పాత్రకి బొమన్ ఇరానీని బాలీవుడ్ నుంచి రప్పించారు. ఇప్పుడు సీనియర్ నటుడు మోహన్ బాబుకి ఒక కీలక పాత్ర ఇవ్వబోతున్నారు అని టాక్.

మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసే కొత్త సినిమాలో మెయిన్ రోల్ కోసం మోహన్ బాబుని అడిగినట్లు గుస గుస.

మోహన్ బాబు ప్రస్తుతం సెమి రిటైర్ మెంట్ లో ఉన్నారు. సూర్య హీరోగా రూపొందిన ‘ఆకాశం నీ హద్దురా’ వంటి సీనిమాల్లో ‘అప్రాధాన్య’ కీలక పాత్రలో కనిపించడం మినహా ఈ మధ్య చెప్పుకోదగ్గ అయన పెద్దగా నటించింది లేదు. మరి మోహన్ బాబుపై త్రివిక్రమ్ దృష్టి ఎందుకు పడిందో?

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటివరకు ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చాయి. ఈ మూడో చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ లో మొదలు కానుంది. హీరోయిన్ గా పూజ హెగ్డే కన్ఫర్మ్ అయింది. మరో హీరోయిన్ గా సంయుక్త మీనన్ పరిశీలనలో ఉందట.

Advertisement
 

More

Related Stories