ఎన్టీఆర్ కథ ఇంకా సెట్ కాలేదా?

NTR


ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రెండో సినిమా త్వరలోనే మొదలు కానుంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న ఈ రెండో చిత్రాన్ని ప్రకటించి చాలా కాలం అయింది. నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. ఐతే, ఇప్పటివరకు కథ కూడా ఓకే కాలేదని వార్తలు గుప్పుమన్నాయి. ఇందులో నిజమెంత?

“ఎన్టీఆర్ కి ఇప్పటికే శివ స్టోరీ లైన్ చెప్పారు. పూర్తి స్క్రిప్ట్ మాత్రం పూర్తి కాలేదు. మొన్నటి వరకు ‘ఆచార్య’తో బిజీగా ఉండడం వల్ల రాయలేదు. కథలో మార్పులు అంటూ ఏవీ లేవు. ఆయన ఇంకా స్క్రిప్ట్ పూర్తి చెయ్యలేదు. స్క్రిప్ట్ పూర్తి అయితే కదా మార్పులు చేర్పులు చేసేది,” అని కొరటాల టీం చెప్తోంది.

‘ఆచార్య’ సినిమాకి సంబంధించిన చివరి భాగం చిత్రీకరణ పూర్తి అయిన కొంత టైం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ మరోసారి స్క్రిప్ట్ గురించి పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతారు. ప్రస్తుతం శివ కథని పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా మలిచే పనుల్లో ఉన్నారు.

ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తారు. కొరటాల మిత్రుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మించే ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ సహ నిర్మాత.

Advertisement
 

More

Related Stories