ఇక వాళ్లకు ఎన్టీఆరే దిక్కు!

NTR


ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ప్రోగ్రాంకి రావాల్సినంత హైప్ రావట్లేదు. దానికి కారణం సరైన ప్రొమోషన్ లేకపోవడం. ఇటీవల విడుదల చేసిన ప్రోమో బాగా ట్రోలింగ్ కి గురయింది. దాంతో, ఈ టీం ఇప్పుడు కొత్తగా, కొంత వివాదాస్పదంగా ప్రొమోషన్ ని ప్లాన్ చేస్తోందట.

అయ్యా నువ్వే దిక్కు….. మమ్మల్ని కాపాడాలంటే నువ్వు రావాలి…. బతికి బట్టకట్టాలి అంటే నువ్వు బరిలోకి దిగాలి… అంటూ జనం అంతా వేడుకునే ఒక ప్రోమో కట్ చేస్తున్నారట. ఆ ప్రోమో కాస్త వివాదాస్పదం అయ్యేలా ఉంది. కానీ కావాల్సినంత అటెన్షన్ వస్తుందట. అందుకే అలాంటిది ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

మరోవైపు, ఎన్టీఆర్ పోలిటికల్ ఎంట్రీ అని సాగుతున్న ప్రచారం అంతా ఉత్తిదే. ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టే వయసు కాదు. ఇంత చిన్న వయసులో ఎంట్రీ ఇఛ్చి హీరోగా మంచి భవిష్యత్ ని పాడు చేసుకునే ఆలోచనలో లేరు ఎన్టీఆర్. ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాతరాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 40 దాటిన తర్వాత అటువైపు మెల్లగా అడుగులు వేస్తారట.

ఎన్టీఆర్ త్వరలోనే కొరటాల శివ డైరెక్షన్ లో కొత్త సినిమా స్టార్ట్ చెయ్యనున్నారు.

Advertisement
 

More

Related Stories