గుమ్మడికాయ కొట్టిన మణిరత్నం


మణిరత్నం తీస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్ పూర్తి చేసుకొంది. మొదటి భాగానికి గుమ్మడి కాయ కొట్టారు. వచ్చే వేసవి సెలవుల్లో విడుదల కానుంది పొన్నియన్ సెల్వన్. ‘బాహుబలి’లాగే ఇది కూడా రాజులు, యుద్ధాల నేపథ్యంలో సాగే కథ.

త్రిష, ఐశ్యర్యారాయ్, విక్రమ్, కార్తీ, జయం రవి, ప్రకాష్ రాజ్ నటిస్తున్న ఈ సినిమా… భారీ చిత్రం. మణిరత్నం కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న మూవీ.

ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా మధ్యప్రదేశ్ లో జరిగింది. అప్పుడు త్రిష చెప్పులు వేసుకొని గుళ్ళోకి అడుగుపెట్టిందని వివాదం రేగింది. అలాగే, ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఒక గుర్రం చనిపోయింది. అది కూడా పొలీసు కేసుకు దారితీసింది. ఇలా ఎన్నో సమస్యలను అధిగమించి సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టారు.

మణిరత్నం ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత డైరెక్షన్ పక్కన పెట్టి తన శిష్యులతో సినిమాలు నిర్మిస్తారట. నెట్ ఫ్లిక్స్ వంటి ఓటిటి కంపెనీలు మణిరత్నంకి ఇలాంటి భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. ఇటీవల ఆయన నెట్ ఫ్లిక్స్ కి ‘నవరస’ అనే ఒక అంథాలజీ సిరీస్ ని నిర్మించారు. కాకపోతే, ఆ సిరీస్ కి రివ్యూస్ బ్యాడ్ గా వచ్చాయి.

Advertisement
 

More

Related Stories