విశాఖలో నిర్మాత భార్య కిడ్నాప్!

ప్రముఖ నిర్మాత, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు కిడ్నాప్ అయినట్లు బయటికి వచ్చిన వార్తలు కలకలం రేపాయి. ఐతే, వాళ్ళు క్షేమంగానే ఉన్నారు అని విశాఖ పోలీసులు తెలిపారు . అంజలి హీరోయిన్ గా “గీతాంజలి” (2014), “లక్కున్నోడు”, “నీవెవరో”, “గల్లీ రౌడీ” వంటి సినిమాలు నిర్మించారు ఎంవీవీ సత్యనారాయణ. ఆయన ఎంపీ కూడా.

ఆయన భార్య జ్యోతి, కుమారుడు చందుతో పాటు ఆయన ఆడిటర్ ని కూడా బుధవారం కిడ్నాప్ చేసినట్లు సమాచారం. సత్యనారాయణ వైజాగ్ లో పేరొందిన బిల్డర్ కూడా. రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల విషయంలోనే ఈ కిడ్నాప్ జరిగినట్లు మీడియా వార్తలు.

సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్ ని ఓ ఇం ట్లో నిర్బంధించినట్లు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి కిడ్నాపర్లని అదుపులోకి తీసుకున్నారట.

పేరొందిన నిర్మాత, ఒక ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ కి గురి కావడం మాత్రం షాకింగ్. “లక్కున్నోడు” అనే సినిమాలో కూడా ఆయన నటించారు. “గల్లీ రౌడీ” అనే సినిమా హిట్ కాకపొతే సినిమాలు ఇక తీయను అని ప్రకటించారు. అందుకే, ఇంకో కొత్త సినిమా ప్రకటించలేదు.

Advertisement
 

More

Related Stories