Advertisement
తెలుగు న్యూస్

ముంబైలో తెలుగు దర్శకుల ముచ్చట్లు


పూరి జగన్నాధ్ గత కొంతకాలంగా తన అడ్రెస్ ని ముంబైకి మార్చారు. విజయ్ దేవరకొండ హీరోగా “లైగర్” అనే సినిమాని పూరి జగన్నాధ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తీస్తున్నారు. హిందీలో కరణ్ జోహార్ సినిమాని నిర్మిస్తున్నారు. దాంతో, ఆయన తన మకాం అక్కడికి మార్చేశారు. పని మీద ముంబైకి వెళ్లిన తెలుగు దర్శకులకు ఆయన ఆఫీస్ అడ్డాగా మారింది. పిచ్చాపాటి మాట్లాడుకునేందుకు, పార్టీలు చేసుకునేందుకు పూరి వారిని తన ఆఫీసుకు వెల్కమ్ చెపుతున్నారు.

పూరి జగన్నాధ్ మంచి హోస్ట్ అని అందరికి తెలిసిందే. ఆయన తాజాగా దర్శకులు క్రిష్, జయం మోహన్ రాజా, హేమంత్ మధుకర్ లకి పార్టీ ఇచ్చారు.

క్రిష్ పవన్ కళ్యాణ్ తో “హరి హర వీరమల్లు” సినిమా తీస్తున్నారు. ఆ పని మీద ముంబై వెళ్లారు. ఇక జయం మోహన్ రాజా ప్రస్తుతం చిరంజీవి హీరోగా “గాడ్ ఫాదర్” చిత్రం తెరకెక్కిసున్నారు. ఈ సినిమాలో ముంబై నటులను ఫిక్స్ చేసేందుకు అక్కడికి వెళ్లారు. అనుష్క హీరోయిన్ గా నిశ్శబ్దం సినేమా తీసిన హేమంత్ మధుకర్ ఎక్కవగా పూరితోనే ఉంటారు. వీరందరికి పూరి పార్టీ ఇచ్చారు.

వీరి ఫోటోని ఛార్మి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Advertisement

This post was last modified on August 22, 2021 11:41 pm

Advertisement
Share