రామ్-త్రివిక్రమ్ మూవీ చేస్తా!


సీనియర్ నిర్మాత స్రవంతి రవికిశోర్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. తాజాగా “దీపావళి” పేరుతో ఒక చిన్న అర్థవంతమైన మూవీ నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. “మనసులను కదిలించే చిత్రమిది,” అని అంటున్నారు.

అలాగే, రామ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో మూవీ తీయాలనేది తన డ్రీం అని చెప్తున్నారు.

‘నువ్వే నువ్వే’ విడుదలై 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా త్రివిక్రమ్ స్రవంతి కాళ్లకు నమస్కరించారు. ఆ విషయం ప్రస్తావించినప్పుడు, “అది మా శ్రీను (త్రివిక్రమ్) సంస్కారం. మేం కలిసి మంచి సినిమాలు చేశాం. మా మధ్య మంచి అనుబంధం ఉంది,” అని అన్నారు. మీరు, త్రివిక్రమ్ మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తారు? “రామ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఉంది. ముందు తన కమిట్మెంట్స్ ఏం ఉన్నాయో త్రివిక్రమ్ చూసుకోవాలి. ఆ తర్వాత ఉంటుంది,” అని జవాబు ఇచ్చారు.

రామ్ తో మరో పెద్ద సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు స్రవంతి రవికిశోర్. రామ్ కి పెద్దనాన్న అవుతారు రవికిశోర్.

Advertisement
 

More

Related Stories