వచ్చే జన్మలో అబ్బాయిగా పుడుతా!

శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో రష్మిక ఒక ఆసక్తికర కామెంట్ చేసింది. ఆమె ఈ సినిమాలో రకరకాల చీరల్లో కనిపిస్తుంది. ఈ సినిమా కోసం ఎన్నో చీరలు కట్టింది. అనేక డ్రెస్సులు మార్చింది.

ఈ మధ్య ‘పుష్ప’లో కూడా మాడ్రన్ స్టయిల్ కి భిన్నమైన డ్రెస్సింగ్ లో కనిపించింది. ఇవన్నీ చూశాక ఆడపిల్లగా పుట్టొద్దు అనిపిస్తోంది అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది. “వచ్చే జన్మంటూ వుంటే మగవాడిగా పుడతాను,” అంటూ చలోక్తి విసిరింది రష్మిక.

చీరలు కట్టుకోవడం అనేది కొంచెం శ్రమతో కూడిన పని అనేది పక్కన పెడితే సినిమా మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ నటించిందట. “నాకు బాగా నచ్చింది ఈ సినిమా. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు,” అని చెప్పింది.

అలాగే, తన పెళ్లి గురించి సాగుతున్న పుకార్లపై కూడా ఫుల్ స్టాప్ పెట్టింది. “పెళ్లి ఆలోచనే లేదిప్పుడు. అవన్నీ రూమర్స్,” అని క్లారిటీ ఇచ్చింది.

Advertisement
 

More

Related Stories