50 కోట్ల పరువు నష్టం దావా


శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకి కోపం వచ్చింది. శృంగార చిత్రాలతో పాపులరయిన షెర్లిన్ చోప్రా తనని శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మానసికంగా, శారీరకంగా వేధించారని ఆరోపణలు చేసింది. అంతేకాదు, పోలీసు కేసు పెట్టింది. దాంతో, శిల్పాశెట్టి, ఆమె భర్త వెంటనే ఒక పరువు నష్టం దావా వేశారు.

50 కోట్ల దావా ఇది.

“ఈ ఆరోపణలు అర్ధరహితం, నిరాధారం, దురుద్దేశపూరితమైనవి,” అని శిల్ప లాయర్లు పేర్కొన్నారు. తమ క్లయింట్ పరువు నష్టం కలిగించినందుకు 50 కోట్ల రూపాయలని కోరుతూ వారు కోర్టులో కేసు ఫైల్ చేశారు. శిల్ప భర్త రాజ్ కుంద్రా ఇటీవలే ‘పోర్న్ చిత్రాల నిర్మాణం’ కేసులో రెండు నెలలు జైల్లో ఉండి బెయిల్ పై వచ్చారు. ఆ కేసు ఇంకా నడుస్తోంది.

రాజ్ కుంద్రా తన చిత్రాల్లో నటించమని కోరారని ఇంతకుముందు షెర్లిన్ చోప్రా ఆరోపించింది. ఆ తర్వాత తనకి ఇస్తానని చెప్పిన మొత్తం ఇవ్వకుండా మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు శిల్ప కూడా తనని వేధించింది అని ఆరోపిస్తోంది షెర్లిన్.

Advertisement
 

More

Related Stories