Advertisement
తెలుగు న్యూస్

మళ్లీ తెరపైకి శ్రీహరి

తెలుగుతెర విలక్షణ నటుల్లో శ్రీహరి ఒకరు. ఎంతో కష్టపడి పైకొచ్చిన నటుడాయన. ఏడేళ్ల కిందట సరిగ్గా ఇదే నెలలో శ్రీహరిని కోల్పోయింది టాలీవుడ్. అలాంటిది మళ్లీ ఇదే నెలలో ఆయన నటించిన ఓ సినిమా రిలీజ్ అవ్వడం యాధృచ్ఛికమే అయినప్పటికీ.. ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులకు అది ఎంతో ఆనందాన్నిస్తోంది.

అవును.. శ్రీహరి భీముడిగా నటించిన ‘నర్తనశాల’ సినిమాలోని కొన్ని దృశ్యాల్ని ఈనెల 24న విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు భీముడి గెటప్ లో ఉన్న శ్రీహరి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ చూసి శ్రీహరి ఫ్యాన్స్ తో పాటు, అతడి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురవుతున్నారు.

Also Read: దసరాకి బాలయ్య నర్తనశాల

చాలా రోజుల తర్వాత నాన్నను తెరపై చూడబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ, శ్రీహరి కొడుకు, నటుడు మేఘామ్ష్ తన ఆనందాన్ని వ్యక్తంచేశాడు. అటు శ్రీహరి అభిమానులంతా ఈరోజు రిలీజైన ఫస్ట్ లుక్ ను ట్రెండ్ చేస్తున్నారు. 

శ్రేయాష్ ఈటీలో ఎన్బీకే థియేటర్ లో శనివారం నుంచి నర్తనశాల సినిమాలోని దృశ్యాల్ని చూడొచ్చు. 17 నిమిషాల ఈ వీడియోను చూడ్డానికి 50 రూపాయలు రేటు ఫిక్స్ చేశారు. వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని ఛారిటీకి ఉపయోగించబోతున్నట్టు ప్రకటించారు బాలయ్య.

Advertisement

This post was last modified on October 21, 2020 1:24 pm

Advertisement
Share