బికినీ షో చాలా కామన్ అయింది!

ఒకప్పుడు ఒక హీరోయిన్ ఒక సినిమాలో బికినీ వేసిందంటే పెద్ద వార్త అయ్యేది. దర్శకుడు కే.రాఘవేంద్రరావులాంటి వారు హీరోయిన్ నడుముపై పూలు, బంతులు, పండ్లు విసిరేందుకు స్విమ్మింగ్ పూల్ సీన్లు పెట్టేవారు. కానీ 30 ఏళ్లలో చాలా మారిపోయింది. ప్రతి హీరోయిన్ ఇప్పుడు బికినీ వేస్తోంది. సినిమాల్లో బికినీలు వెయ్యడం చాలా కామన్ అయిపోయి పది, పదిహేనేళ్ళు అవుతోంది. ఇప్పుడు హీరోయిన్లు ఇన్ స్టాగ్రామ్ కోసం బికినీలు వెయ్యడం ఒక ట్రెండ్ గా మారింది.
సమంత, రాశి ఖన్నా, ప్రగ్య జైస్వాల్, ప్రియాంక చోప్రా, మృణాల్ ఠాకూర్, అనన్య పాండే, దిశా పటాని… ఇలా లిస్ట్ పెద్దదే. వీళ్ళు తరుచుగా తమ బికినీ ఫోటోలను వెకేషన్ ఫోటోల పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు కలిగిస్తున్నారు.

ప్రగ్య జైస్వాల్ ఇటీవల ఎక్కువగా బికినీ ఫోటోలు పెడుతోంది. దాదాపు ప్రతివారం బికినీ ఫోటోషూట్లు చేసి మరీ ఆమె తన అభిమానులకు ట్రీట్ ఇస్తోంది.

మృణాల్ ఠాకూర్ ఈ విషయంలో మిగతా హీరోయిన్లతో పోల్చితే వెనుకంజలో ఉంది. కానీ ఆ మధ్య మాత్రం తన బ్లూ బికినీ ఫోటోలు షేర్ చేసి తన అభిమానులకు ఆనందాన్ని పంచింది.

జాన్వీ కపూర్ మిగతా బాలీవుడ్ హీరోయిన్ల మాదిరిగా ఎక్కువగా తన బికినీ ఫోటోలను షేర్ చెయ్యదు. కానీ, ఒకట్రెండు సార్లు మాత్రం బికినీ వీడియోలను పెట్టింది ఇన్ స్టాగ్రామ్ లో.

ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఆమె వెకేషన్ వెళ్లిందంటే మనకు బికినీ ఫోటోలతో ట్రీట్ ఉంటుంది.
ALSO READ: Ananya Panday soaks in Maldives’ tropical beauty in a bikini

రాశి ఖన్నా ఇటీవల ఉత్తరాఖండ్ లో వెకేషన్ కి వెళ్లి ఇలా ఫోజులు ఇచ్చింది.

సమంత ఆ మధ్య బాలికి వెళ్లి అక్కడ జలకాలాటలు ఆడింది.

అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో తరుచుగా తన గ్లామర్ ఫోటోషూట్ ఫోటోలను షేర్ చేస్తుంది. కానీ ఆ మధ్య భర్తతో కలిసి మాల్దీవుల వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ బికినిలో హల్చల్ చేసింది. ఆ వీడియోలు, ఫోటోలు ఆమె తన సోషల్ మీడియాలో పెట్టడం, దానికి బాగా ట్రోలింగ్ జరగడం… చకచకా అయిపోయింది. ఆ తర్వాత ఆమె వీడియోలను మొత్తం డిలిట్ చేసింది.