షూటింగ్ లతో టాలీవుడ్ కళకళ

- Advertisement -
Svp Rapo

తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కసారిగా కళకళలాడుతోంది. ఈ రోజు (జులై 12)తో దాదాపు అన్ని సినిమాలు సెట్స్ పైకి వచ్చాయి. ఒక్క పవన్ కళ్యాణ్ సినిమా తప్ప కరోనా రెండో వేవ్ లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన అన్ని చిత్రాలు తిరిగి షురూ అయ్యాయి. అంతేకాదు, కొత్తగా రెండు సినిమాలు కూడా ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుపుకున్నాయి. మహేష్ బాబు, బాలకృష్ణ …బ్యాక్ టు సెట్స్ అంటూ వచ్చేశారు.

సర్కారు వారి పాట
మహేష్ బాబు నటిస్తున్న చిత్రం… సర్కారు వారి పాట. దర్శకుడు పరశురాం తీస్తున్న ఈ మూవీ షూటింగ్ ఈరోజు మొదలైంది. మూడు నెలల గ్యాప్ తర్వాత మహేష్ బాబు సెట్ కి వచ్చారు. ఏప్రిల్ చివరి వారంలో ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగింది. త్వరలోనే విదేశాల్లో కొంత భాగం తీయనున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్.

రామ్ పోతినేని మూవీ
రామ్ పోతినేని కూడా ఈ రోజు తన కొత్త చిత్రం షూటింగ్ షురూ చేశారు. ఇది ఇంతకుముందు షూటింగ్ ఆగిన చిత్రం కాదు. ఈ రోజు ఫస్ట్ డే షూటింగ్. తమిళ దర్శకుడు లింగుస్వామి తీస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్.

అఖండ
నందమూరి బాలకృష్ణ కూడా సెట్స్ పైకి వచ్చాడు మూడు నెలల గ్యాప్ తర్వాత. ‘అఖండ’ షూటింగ్ ఈ రోజు షురూ. చివరి దశకు చేరుకొంది ఈ మూవీ. బోయపాటి తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఏజెంట్
అఖిల్ నటించిన నాలుగో చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదలకు మోక్షం ఎప్పుడో తెలియదు. కానీ, అతని ఇదో చిత్రం ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మొదలైన ఈ మూవీలో కొత్త భామ సాక్షి వైద్య హీరోయిన్.

More

Related Stories