Advertisement
తెలుగు న్యూస్

విజయ్, చరణ్… ఇద్దరిలో ఒక్కరే!


టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమిళ, హిందీ సినిమా రంగాలలో కూడా నిర్మాతగా తన సత్తా చాటాలనుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక తమిళ అగ్ర హీరో విజయ్ తో ఆయన ఒక పాన్ ఇండియా చిత్రం ప్రకటించారు.

దిల్ రాజు ప్రస్తుతం రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు నిర్మిస్తున్నారు. ఒకటి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా, మరోటి శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా. ఈ రెండూ వచ్చే ఏడాది విడుదల అవుతాయి. ఇందులో ఒకటి సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలనేది దిల్ రాజ్ ప్లాన్.

“శంకర్ – రామ్ చరణ్ సినిమాని సంక్రాంతి 2023కి విడుదల చేయాలనుకుంటున్నాం. ఒకవేళ అది లేట్ అయ్యే అవకాశం ఉంటే విజయ్ సినిమాని సంక్రాంతి బరిలో దింపుతాం. రెండింట్లో ఒకటి మాత్రం పక్కాగా పొంగల్ పోటీలో ఉంటుంది. ఏది అనేది ఇప్పుడే చెప్పలేను. కానీ 2023 సంక్రాంతి బరిలో మా బ్యానర్ మూవీ ఉంటుంది,” అని దిల్ రాజు చెప్తున్నారు.

విజయ్ సినిమాతో తమిళనాడులో భారీగా తన బ్యానర్ ఎంట్రీ ఉంటుంది అని దిల్ రాజు నమ్మకంగా ఉన్నారు.

Advertisement

This post was last modified on January 25, 2022 4:20 pm

Advertisement
Share