సాయి తేజ్ ‘పబ్లిక్’ ఎంట్రీ ఎప్పుడు?

Sai Dharam Tej


సాయి ధరమ్ తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దసరా పండక్కి ఇంటికొచ్చాడు. నెల రోజులకి పైనే హాస్పిటల్ లో ఉన్న సాయి తేజ్ ఇప్పుడు ఇంటివద్దే పిజియోథెరపీ చేయించుకుంటున్నాడు.

ఐతే, ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తర్వాత ఇంతవరకు సాయి తేజ్ ఫోటోని విడుదల చెయ్యలేదు. ఆయన డిశ్చార్జ్ అయ్యాక కూడా ఫోటోకానీ, వీడియోకానీ బయటికి రాలేదు. మళ్ళీ నార్మల్ గా నడవగలిగి, బలంగా మాట్లాడగలిగే స్థితికి వచ్చేవరకు పబ్లిక్ అప్పీయరెన్స్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు ఉంది.

సాయి తేజ్ మరో నెలరోజుల పాటు ఇంటిపట్టునే ఫిజియోథెరపీ చేయించుకోవాలి.

వినాయక చవితినాడు బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డాడు సాయి తేజ్. స్పోర్ట్స్ బైక్ వెళ్తుండగా హైదరాబాద్ లోని మాదాపూర్ లోని ఐకియా స్టోర్ కి సమీపంలో ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఇసుక పేరుకుపోయిన కారణంగా దాంతో బైక్ స్లిప్ అయి తీవ్రంగా గాయపడ్డాడు సాయి తేజ్. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి నెల పట్టింది. అంత తీవ్రమైన గాయాలు అయ్యాయి. మొదట్లో చిన్న ప్రమాదమే అని భావించినా ఇంటర్నల్ ఇంజ్యూరీ వల్ల ఇప్పటికీ సంపూర్ణంగా కోలుకోలేదు.

Advertisement
 

More

Related Stories