ఈ పిల్లతో కలిసొస్తుందా?

Krithi Shetty

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా తెలుగుతెరపై తన అందచందాలతో విరుచుకుపడింది కృతి శెట్టి. ఈ భామకి ఇప్పుడు చాలా క్రేజుంది.

ఈ భామకి యూత్ లో ఉన్న పాపులారిటీ, హిట్ సెంటిమెంట్ తనకి కలిసొస్తాయని దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆమె హీరోయిన్ గా, సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి ఒక మూవీ చేస్తున్నారు. ఇంతకుముందు ఆయన ఎన్నో అంచనాలతో తీసిన “వి” సినిమా అపజయం పాలైంది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలి. ఈ అమ్మాయికి ఉన్న క్రేజ్ కూడా కలిసొస్తే ఆయన గట్టెక్కడం ఖాయం.

ఇంద్రగంటికి ఇప్పటివరకు ‘రొమాంటిక్’ చిత్రాలే విజయాన్ని తెచ్చిపెట్టాయి. సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా తీస్తున్న ”ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది” అలాంటిదే. ఇలా అన్ని సెంటిమెంట్స్ తో మళ్ళీ ట్రాక్ లోకి వస్తానని ధీమాగా ఉన్నారు ఇంద్రగంటి.

కృతి శెట్టి ఈ సినిమాతో పాటు, నాని సరసన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం చేస్తోంది. ఐతే, ఇంద్రగంటి సినిమాలో ఆమె సోలో హీరోయిన్. నాని చిత్రంలో సాయి పల్లవి, మడోన్నా కూడా ఉన్నారు. సో, కృతి కూడా తన క్రేజును చూపించుకోవాలి.

Advertisement
 

More

Related Stories