షారుక్ కి వై ప్లస్ భద్రత

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ వరుస విజయాలతో మళ్ళీ తన స్టార్డం ప్రూవ్ చేసుకున్నారు. అటు పఠాన్, ఇటు జవాన్… రెండూ చెరో 1000 కోట్లపైనే వసూళ్లు అందుకున్నాయి.

ఐతే, షారుక్ ఖాన్ కి కూడా బెదిరింపు కాల్స్ మొదలయ్యాయట. ఆ మధ్య సల్మాన్ ఖాన్ ని చంపుతామంటూ కొందరు బెదిరించారు. దాంతో ప్రభుత్వం సల్మాన్ కి ప్రత్యేక భద్రత కల్పించింది.

ఇప్పుడు షారుఖ్‌కు కూడా భద్రత కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. షారుఖ్‌కు వై ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆరుగురు సెక్యూరిటీ అధికారులు నిత్యం షారుక్ సెక్యూరిటీని చూసుకుంటారు.

బీజేపీ ప్రభుత్వంపై ఇటీవల షారుక్ తన సినిమాలో విమర్శలు గుప్పించారు. అలాగే, షారుక్ కొడుకుని ఒక కేసులో ఇరికించి మహారాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఐతే, ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలతో ప్రభుత్వం షారుక్ జోలికి వెళ్లడం లేదు. పైగా ఆయనకి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది.

ఒక “పవర్ ఫుల్” వ్యక్తి నుంచి కాల్ వెళ్లిన తర్వాతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షారుక్ పై మనసు మార్చుకున్నాయి అని టాక్. అప్పటి నుంచి షారుక్ సినిమాలను అడ్డుకోవా కానీ, షారుక్ ని బద్నామ్ చేసే ప్రయత్నం జరగడం లేదు.

Advertisement
 

More

Related Stories