సీనియర్ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది. 50 ఏళ్ల నటన కెరీర్ కి దక్కిన గౌరవం అది. ఐతే, తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య పద్మ అవార్డు విషయంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
బసవతారకం ఆసుపత్రిలో జరిగిన తన పుట్టిన రోజు వేడుకల్లో బాలయ్య మాట్లాడారు. అవార్డులకు నేను అలంకారం కానీ అవి నాకు కావు అంటూ బాలయ్య వ్యాఖ్యానించడంతో ఆ వీడియో వైరల్ అయింది.
“నేను ఒకటే అంటాను. బిరుదలకు, ఇటువంటి వాటికి నేను అలంకారం ఏమో కానీ అవి నాకు ఎప్పుడు అలంకారం కాదంటాను. ఈ బిరుదు నాకు నటనకు ఇచ్చారు. కానీ నేను మాత్రం నా సంఘసేవకు ఇచ్చారని భావిస్తాను. సో, ఇందులో మీ (ఆసుపత్రి సిబ్బంది) భాగస్వామ్యం ఉంది,” అని బాలయ్య అన్నారు.
గతంలో ఎన్టీఆర్ కి భారతరత్న అవార్డు కాలిగోటితో సమానం అని వ్యాఖ్యానించి వివాదం రేపారు బాలయ్య.
కేంద్ర ప్రభుత్వ అవార్డులను బాలయ్య తక్కువ చేసి మాట్లాడుతుంటారు, మళ్ళీ వాటికోసం మొత్తం నందమూరి అభిమానులు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు వాటినే డిమాండ్ చేస్తుంటారు, వాటికోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు అంటూ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది.
ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…