సీనియర్ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది. 50 ఏళ్ల నటన కెరీర్ కి దక్కిన గౌరవం అది. ఐతే, తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య పద్మ అవార్డు విషయంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
బసవతారకం ఆసుపత్రిలో జరిగిన తన పుట్టిన రోజు వేడుకల్లో బాలయ్య మాట్లాడారు. అవార్డులకు నేను అలంకారం కానీ అవి నాకు కావు అంటూ బాలయ్య వ్యాఖ్యానించడంతో ఆ వీడియో వైరల్ అయింది.
“నేను ఒకటే అంటాను. బిరుదలకు, ఇటువంటి వాటికి నేను అలంకారం ఏమో కానీ అవి నాకు ఎప్పుడు అలంకారం కాదంటాను. ఈ బిరుదు నాకు నటనకు ఇచ్చారు. కానీ నేను మాత్రం నా సంఘసేవకు ఇచ్చారని భావిస్తాను. సో, ఇందులో మీ (ఆసుపత్రి సిబ్బంది) భాగస్వామ్యం ఉంది,” అని బాలయ్య అన్నారు.
గతంలో ఎన్టీఆర్ కి భారతరత్న అవార్డు కాలిగోటితో సమానం అని వ్యాఖ్యానించి వివాదం రేపారు బాలయ్య.
కేంద్ర ప్రభుత్వ అవార్డులను బాలయ్య తక్కువ చేసి మాట్లాడుతుంటారు, మళ్ళీ వాటికోసం మొత్తం నందమూరి అభిమానులు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు వాటినే డిమాండ్ చేస్తుంటారు, వాటికోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు అంటూ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది.
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…
'పెద్ది' (Peddi) సినిమా వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్ జాన్వి కపూర్ (Janhvi Kapoor)ను అక్కడక్కడ అభ్యంతరకరంగా…
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…