ఇదో క్రేజీ రూమర్. ఆల్రెడీ అక్క జాన్వి కపూర్ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇప్పుడు చెల్లెలు ఖుషీ కపూర్ కూడా టాలీవుడ్ పై కన్నేసిందంట. జాన్విలానే ఖుషి కూడా నందమూరి కాంపౌండ్ పైనే గురిపెట్టిందనేది తాజా సమాచారం.
బాలకృష్ణ తన నటవారసుడిగా మోక్షజ్ఞను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయబోతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నాడు మోక్షు. ఇందులో హీరోయిన్ గా ఖుషి కపూర్ ను తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట మేకర్స్. వినడానికి కాస్త క్రేజీగా ఉన్నప్పటికీ ఇదేమంత అసాధ్యం కాదు.
ఎందుకంటే, ఖుషీ కపూర్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉంది. ఓటీటీలో అడుగుపెడుతూనే, బాలీవుడ్ లోకి కూడా వచ్చేసింది. కాబట్టి ఈమెను టాలీవుడ్ కు తీసుకురావడం పెద్ద సమస్య కాదు. పైగా అక్క కూడా ఇక్కడే ఉంది కాబట్టి, చెల్లెలకు పని ఈజీ అయిపోతుంది.
ఈ సందర్భంగా బోనీ కపూర్ గతంలో చేసిన కామెంట్స్ ను ఓసారి గుర్తుచేసుకుందాం. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో మాట్లాడిన బోనీ కపూర్, తన చిన్నకూతురు ఖుషీకి కూడా సౌత్ సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. చూస్తుంటే, పుకార్లు నిజమయ్యేలా ఉన్నాయి. జాన్వి-ఖుషి కలిసి టాలీవుడ్ ను ఏలేలా ఉన్నారు.
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…