“ఇన్నాళ్లూ రాజ్ తరుణ్ ను ఇబ్బంది పెట్టాను. ఇకపై అతడ్ని ఇబ్బంది పెట్టను, అన్ని కేసులు ఉపసంహరించుకుంటాను. కనిపిస్తే కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెబుతాను” కొన్ని రోజుల కిందట లావణ్య ఇచ్చిన స్టేట్ మెంట్ ఇంది.
“ఇప్పుడు నేను ఉంటున్న విల్లా రాజ్ తరుణ్ దే. నాకు ఆ విల్లా అక్కర్లేదు. రాజ్ తరుణ్ ముందుకొచ్చి నాతో మాట్లాడాలి. చర్చలు జరపాలి. నేను బయటకు వెళ్లిపోతాను.” ఈరోజు లావణ్య ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది.
“రాజ్ తరుణ్ రౌడీల్ని పెట్టించి నాపై దాడి చేయిస్తున్నాడు. నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అతడ్ని కోర్టు మెట్లు ఎక్కిస్తాను. ఫిలిం ఛాంబర్ ముందు ధర్నా చేస్తాను.” కొద్దిసేపటికి కిందట లావణ్య చేసిన ప్రకటన ఇది.
అసలు లావణ్య ఏం కోరుకుంటోంది.. ఆమెకు ఏం కావాలి.. రాజ్ తరుణ్ సంతోషంగా ఉంటే చాలు, అతడి జీవితం నుంచి వెళ్లిపోతానంటోంది.. మరోవైపు కోర్టుకు లాగుతానంటోంది, కేసులు పెడుతోంది.
ప్రస్తుతం తను ఉంటున్న విల్లా రాజ్ తరుణ్ దే అంటోంది, కానీ తనకు అక్కర్లేదంటోంది. అతడు ముందుకొచ్చి మాట్లాడితే విల్లా విడిచి వెళ్లిపోతానంటోంది.
ఇకపై రాజ్ తరుణ్ గురించి పబ్లిక్ గా మాట్లాడను. “చిన్నోడా నిన్ను ఇబ్బందిపెట్టను” అంటూ మాట్లాడిన లావణ్య, ఇప్పుడు అతడి కోసం ఫిలిం ఛాంబర్ ముందు ధర్నా చేస్తానంటోంది.
రాజ్ తరుణ్ వద్దు, విల్లా వద్దు అన్నప్పుడు ఎందుకిదంతా..? ఆమె స్వచ్ఛందంగా బయటకెళ్లిపోవచ్చు కదా? ఆమె మీడియా ఎటెన్షన్ కోరుకుంటోందా? సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…