వరుస సంగీత విభావరులతో ఊపుమీదున్న దేవిశ్రీ ప్రసాద్ కు విశాఖ పోలీసులు బ్రేకులేశారు. మరో 2 రోజుల్లో వైజాగ్ లో జరగనున్న మ్యూజికల్ నైట్ కు అనుమతి నిరాకరించారు. ఒకసారి, రెండు సార్లు కాదు, ఏకంగా 4 సార్లు అనుమతి నిరాకరించడంతో కన్సర్ట్ జరగడం కష్టమనే టాక్ నడుస్తోంది.
ఇలాంటి టైమ్ లో ఉన్నఫలంగా వైజాగ్ లో ల్యాండ్ అయ్యాడు దేవిశ్రీ. అతడు తన షో కోసమే వైజాగ్ చేరుకున్నాడు. ఓవైపు అనుమతి దొరక్కుండా, దేవిశ్రీ వైజాగ్ లో ల్యాండ్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
పోర్ట్ స్టేడియంలో ఈవెంట్ పెట్టుకున్నారు. దాని కెపాసిటీ 3వేలు మాత్రమే, నిర్వహకులు మాత్రం 10వేల టికెట్లు అమ్ముకున్నారు. దీంతో పర్మిషన్ రాలేదు. ఈ నేపథ్యంలో, వేదిక మారుస్తారా లేక పోలీసులతో మరోసారి చర్చిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.
కొన్ని రోజుల కిందట విశాఖలోనే ఓ స్పోర్ట్స్ స్విమ్మింగ్ సెంటర్ లో బాలుడు మృతి చెందాడు. అప్పట్నుంచి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులో ఎదురుకాని సమస్య, దేవిశ్రీకి విశాఖలో ఎదురైంది.
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…
'పెద్ది' (Peddi) సినిమా వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్ జాన్వి కపూర్ (Janhvi Kapoor)ను అక్కడక్కడ అభ్యంతరకరంగా…
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…