వరుస సంగీత విభావరులతో ఊపుమీదున్న దేవిశ్రీ ప్రసాద్ కు విశాఖ పోలీసులు బ్రేకులేశారు. మరో 2 రోజుల్లో వైజాగ్ లో జరగనున్న మ్యూజికల్ నైట్ కు అనుమతి నిరాకరించారు. ఒకసారి, రెండు సార్లు కాదు, ఏకంగా 4 సార్లు అనుమతి నిరాకరించడంతో కన్సర్ట్ జరగడం కష్టమనే టాక్ నడుస్తోంది.
ఇలాంటి టైమ్ లో ఉన్నఫలంగా వైజాగ్ లో ల్యాండ్ అయ్యాడు దేవిశ్రీ. అతడు తన షో కోసమే వైజాగ్ చేరుకున్నాడు. ఓవైపు అనుమతి దొరక్కుండా, దేవిశ్రీ వైజాగ్ లో ల్యాండ్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
పోర్ట్ స్టేడియంలో ఈవెంట్ పెట్టుకున్నారు. దాని కెపాసిటీ 3వేలు మాత్రమే, నిర్వహకులు మాత్రం 10వేల టికెట్లు అమ్ముకున్నారు. దీంతో పర్మిషన్ రాలేదు. ఈ నేపథ్యంలో, వేదిక మారుస్తారా లేక పోలీసులతో మరోసారి చర్చిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.
కొన్ని రోజుల కిందట విశాఖలోనే ఓ స్పోర్ట్స్ స్విమ్మింగ్ సెంటర్ లో బాలుడు మృతి చెందాడు. అప్పట్నుంచి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులో ఎదురుకాని సమస్య, దేవిశ్రీకి విశాఖలో ఎదురైంది.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…