ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను మానసికంగా ఇప్పటికీ బాధపెడుతున్నాడట. అయితే ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగానే.
ప్రభాస్ విషయంలో నిత్యామీనన్ చేసిన తప్పు, అతడి అభిమానులకు ఇంకా గుర్తే. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి అడిగితే అతడెవరో తనకు తెలియదంటూ స్పందించింది నిత్యా మీనన్.
ఆ టైమ్ లో ప్రభాస్ ఫ్యాన్స్, ఆమెపై విరుచుకుపడ్డారు. ఆ ట్రోలింగ్ ను నిత్యామీనన్ తట్టుకోలేకపోయింది. ఆ బాధ తనను ఇంకా వెంటాడుతోందని, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది నిత్యా.
తెలుగులో కెరీర్ అప్పుడే మొదలుపెట్టానని, నిజంగా అప్పుడు తనకు ప్రభాస్ తెలియదని, అయితే ఆ విషయాన్ని అలా ఓపెన్ గా చెప్పడం తప్పనే విషయాన్ని ఆ తర్వాత తెలుసుకున్నానని అంటోంది నిత్యామీనన్. మీడియా ముందు మాట్లాడేటప్పుడు లౌక్యం అవసరమనే విషయాన్ని కూడా ఆ ఘటన తోనే తెలుసుకున్నట్టు వెల్లడించింది.
ఇప్పటికీ ఆ ఇష్యూ తనను మానసికంగా వెంటాడుతోందని, ప్రభాస్ ఎవరో తెలియదని చెప్పడం తనను ఇప్పటికీ బాధిస్తోందని గిల్ట్ ఫీల్ అవుతోంది నిత్యామీనన్.
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…