హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది. ఈ రూమర్ నిజమైతే కనుక, కెరీర్ లో తొలిసారి పోలీస్ గా కనిపించనుంది సాయిపల్లవి.
ధనుష్ తన 55వ చిత్రం చేస్తున్నాడు. రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. ఇందులో హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమాలోనే ఆమె పోలీస్ గా కనిపిస్తుందనే కొత్త రూమర్ ఊపందుకుంది. ఇది నిజం అవ్వాలని ఆమె ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.
ఇంతకుముందు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ‘అమరన్’ సినిమా చేసింది సాయిపల్లవి. ఈసారి ఆమె కోసం పోలీస్ పాత్రను సిద్ధం చేశాడట ఈ దర్శకుడు. ఈ సినిమాలో సాయిపల్లవితో పాటు శ్రీలీల కూడా నటిస్తోంది.
వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ పై స్వయంగా ధనుష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…