మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత భారీ స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ సినిమా థియేటర్లలో నిలబడలేదు. ఇంకా చెప్పాలంటే ఫ్లాప్ అయింది.
ఈ సినిమా రిజల్ట్ పై తాజాగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ స్పందించారు. శివుడు-పార్వతి వెకిలిగా ఉంటే సినిమా ఎవడు చూస్తాడని ప్రశ్నించారు తమ్మారెడ్డి.
“ఇప్పటికే కన్నప్పపై కొన్ని సినిమాలొచ్చాయి. అన్నీ బాగా ఆడాయి. కన్నప్ప మాత్రం ఆడలేదు. ఎందుకంటే, ప్రతిసారి భక్తిభావం నిలబడింది, ఈసారి నిలబడలేదు. ఇక్కడ శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఫోన్ చేసి విష్ణు, మోహన్ బాబుకు చెప్పాను. భక్తి లేకుండా భక్త కన్నప్ప తీశారని చెప్పాను. శివుడే సరిగ్గా లేకపోతే భక్తి ఎక్కడ్నుంచి వస్తుంది. అనామకుడ్ని పెట్టినా బాగుండేది. శివుడు, పార్వతి పాత్రల కోసం పెట్టిన డబ్బులన్నీ బొక్క.”
ఇలా ఉన్నదున్నట్టు ఓపెన్ గా మాట్లాడేశారు తమ్మారెడ్డి. తను ఇలా ఓపెన్ గా మాట్లాడ్డానికి ఓ కారణం కూడా ఉందంటున్నారాయన.
“ఇది తప్పు అని నేను చెప్పకపోతే ఇండస్ట్రీకి నష్టం. రేపు మరొకరు మరో ఫ్లాప్ కన్నప్ప తీస్తారు.” అనేది ఆయన వెర్షన్.
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…