మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత భారీ స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ సినిమా థియేటర్లలో నిలబడలేదు. ఇంకా చెప్పాలంటే ఫ్లాప్ అయింది.
ఈ సినిమా రిజల్ట్ పై తాజాగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ స్పందించారు. శివుడు-పార్వతి వెకిలిగా ఉంటే సినిమా ఎవడు చూస్తాడని ప్రశ్నించారు తమ్మారెడ్డి.
“ఇప్పటికే కన్నప్పపై కొన్ని సినిమాలొచ్చాయి. అన్నీ బాగా ఆడాయి. కన్నప్ప మాత్రం ఆడలేదు. ఎందుకంటే, ప్రతిసారి భక్తిభావం నిలబడింది, ఈసారి నిలబడలేదు. ఇక్కడ శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఫోన్ చేసి విష్ణు, మోహన్ బాబుకు చెప్పాను. భక్తి లేకుండా భక్త కన్నప్ప తీశారని చెప్పాను. శివుడే సరిగ్గా లేకపోతే భక్తి ఎక్కడ్నుంచి వస్తుంది. అనామకుడ్ని పెట్టినా బాగుండేది. శివుడు, పార్వతి పాత్రల కోసం పెట్టిన డబ్బులన్నీ బొక్క.”
ఇలా ఉన్నదున్నట్టు ఓపెన్ గా మాట్లాడేశారు తమ్మారెడ్డి. తను ఇలా ఓపెన్ గా మాట్లాడ్డానికి ఓ కారణం కూడా ఉందంటున్నారాయన.
“ఇది తప్పు అని నేను చెప్పకపోతే ఇండస్ట్రీకి నష్టం. రేపు మరొకరు మరో ఫ్లాప్ కన్నప్ప తీస్తారు.” అనేది ఆయన వెర్షన్.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…