మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత భారీ స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ సినిమా థియేటర్లలో నిలబడలేదు. ఇంకా చెప్పాలంటే ఫ్లాప్ అయింది.
ఈ సినిమా రిజల్ట్ పై తాజాగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ స్పందించారు. శివుడు-పార్వతి వెకిలిగా ఉంటే సినిమా ఎవడు చూస్తాడని ప్రశ్నించారు తమ్మారెడ్డి.
“ఇప్పటికే కన్నప్పపై కొన్ని సినిమాలొచ్చాయి. అన్నీ బాగా ఆడాయి. కన్నప్ప మాత్రం ఆడలేదు. ఎందుకంటే, ప్రతిసారి భక్తిభావం నిలబడింది, ఈసారి నిలబడలేదు. ఇక్కడ శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఫోన్ చేసి విష్ణు, మోహన్ బాబుకు చెప్పాను. భక్తి లేకుండా భక్త కన్నప్ప తీశారని చెప్పాను. శివుడే సరిగ్గా లేకపోతే భక్తి ఎక్కడ్నుంచి వస్తుంది. అనామకుడ్ని పెట్టినా బాగుండేది. శివుడు, పార్వతి పాత్రల కోసం పెట్టిన డబ్బులన్నీ బొక్క.”
ఇలా ఉన్నదున్నట్టు ఓపెన్ గా మాట్లాడేశారు తమ్మారెడ్డి. తను ఇలా ఓపెన్ గా మాట్లాడ్డానికి ఓ కారణం కూడా ఉందంటున్నారాయన.
“ఇది తప్పు అని నేను చెప్పకపోతే ఇండస్ట్రీకి నష్టం. రేపు మరొకరు మరో ఫ్లాప్ కన్నప్ప తీస్తారు.” అనేది ఆయన వెర్షన్.
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్మైషోలో…
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మూడు ఏరియాల్లో…
దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…
ధనుష్ (Dhanush) హీరోగా ఆర్ టేక్ స్టూడియోస్, వండర్బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘ఓం: చాప్టర్ 1’…
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…