కొన్ని రోజులుగా ‘విశ్వంభర’ సినిమాపై చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదని, వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉందంటూ కథనాలు వస్తున్నాయి.
తాజాగా వీటిపై దర్శకుడు వశిష్ఠ స్పందించాడు. సినిమా విడుదలపై క్లారిటీ ఇవ్వలేదు కానీ, ఇంకాస్త టైమ్ పడుతుందని మాత్రం చెప్పేశాడు. గ్రాఫిక్స్ వల్లనే సినిమా లేట్ అవుతుందని వెల్లడించాడు.
“విశ్వంభర సినిమాలో 4676 గ్రాఫిక్ షాట్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమాపై వర్క్ చేస్తున్నాయి. ఆ పనులు ఓ కొలిక్కి రావడానికి టైమ్ పడుతుంది. ప్రతి ఫ్రేమ్ ను విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. కాబట్టి టైమ్ పడుతుంది.”
ఇలా ‘విశ్వంభర’ విడుదల లేట్ అవుతుందని చెప్పేశాడు వశిష్ఠ. ఈ సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఒక సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. అది ఐటెంసాంగ్. ఈ సాంగ్ షూట్ తో పాటు, గ్రాఫిక్స్ కొలిక్కి వచ్చిన వెంటనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామంటున్నాడు వశిష్ఠ.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని "పెద్ది" సినిమాలో చూపించిన విధానం, ఆమె పాత్ర చిత్రీకరణ విషయంలో రేగిన గోల నేపథ్యంలో…
అందాల నిధి (Nidhhi Agerwal)కి పేరుకు తగ్గట్టుగానే అందాల గని ఉంది. కానీ ఆమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేదు.…