మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు అంబటి రాయుడు నోరు పారేసుకున్నాడు. నిన్న జరిగిన ఇండో-పాక్ మ్యాచ్ లో సెలబ్రిటీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు రాయుడు. వాళ్లంతా కేవలం పబ్లిసిటీ కోసం మ్యాచ్ కు వచ్చారంటూ సెటైర్లు వేసి విమర్శల పాలయ్యాడు.
దుబాయ్ లో జరిగిన మ్యాచ్ చూడ్డానికి మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరక్టర్ సుకుమార్ తో పాటు చాలామంది హాజరయ్యారు. వీళ్లలో సంతోష్, నారా లోకేష్ లాంటి రాజకీయ నాయకులు, ఊర్వశి రౌతేలా, సన్నీ లియోన్ లాంటి తారలు కూడా ఉన్నారు.
ఒక దశలో కెమెరా సుకుమార్ వైపు టర్న్ అయింది. అది చూసిన కామెంటేటర్, “ప్రైడ్ అఫ్ తెలుగు సినిమా సుకుమార్” అంటూ రియాక్ట్ అయ్యాడు. ఈసారి చాలామంది తెలుగువాళ్లు వచ్చారన్నాడు. దీన్ని రాయుడు లైట్ తీసుకున్నాడు.
ఇండియా-పాక్ మ్యాచ్ అంటే అందరి దృష్టి దీనిపైనే ఉంటుంది కాబట్టి, టీవీల్లో కనిపిస్తే ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని చాలామంది మ్యాచులకు వచ్చారంటూ విమర్శలు చేశాడు. దీంతో రాయుడిపై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.
చిరంజీవి లాంటి మెగాస్టార్ కు పబ్లిసిటీ అవసరమా… సుకుమార్ లాంటి డైరక్టర్ ఫ్రీ పబ్లిసిటీ కోసం వెంపర్లాడతాడా… అంటూ రాయుడ్ని ట్రోల్ చేస్తున్నారు.
లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, వేల కిలోమీటర్లు ప్రయాణించి క్రికెట్ మ్యాచులకు వచ్చేది ఇండియాపై అభిమానంతో తప్ప, పబ్లిసిటీ కోసం కాదని, ఈ విషయాన్ని రాయుడు గ్రహిస్తే బాగుంటుందని అంటున్నారు.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…