లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన ఎస్ జే సూర్య, చాలా జాగ్రత్తగా తన కొత్త సినిమాకు ఓ రూపు తీసుకొస్తున్నాడు. ‘కిల్లర్’ టైటిల్ తో కొత్త ప్రాజెక్టు ఎనౌన్స్ చేసిన ఈ నటుడు, ప్రస్తుతం ఆ సినిమాకు కాస్టింగ్, టెక్నీషియన్స్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడు.
ఇందులో భాగంగా తన సినిమాకు ఏఆర్ రెహ్మాన్ కు సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. ఎస్ జే సూర్యకు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఆ విషయం టాలీవుడ్ జనాలకు తెలియకపోవచ్చు కానీ, కోలీవుడ్ ఆడియన్స్ కు తెలుసు. సో.. వీళ్లిద్దరి కాంబోలో మంచి సాంగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
అయితే సూర్య ఆలోచన మరోలా ఉంది. పాటల కోసం రెహ్మాన్ ను తీసుకోలేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ‘కిల్లర్’ మూవీకి సరికొత్త సౌండింగ్ కావాలి, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కావాలి. ఇంకా చెప్పాలంటే సంగీతంతో ప్రయోగం చేయాలి. అందుకే రెహ్మాన్ ను ఎంచుకున్నాడు.
స్వీయ దర్శకత్వంలో ఎస్ జే సూర్య హీరోగా ఈ సినిమా రాబోతోంది. గోకులం మూవీస్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు ఎస్ జే సూర్య. ఈ ప్రాజెక్టు కోసం అతడు తన యాక్టింగ్ కు కెరీర్ కు చిన్న గ్యాప్ ఇచ్చాడు.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…