ఏవీఎం స్టుడియోస్.. సౌతిండియన్ సినిమాలో ఈ సంస్థకు దశాబ్దాల చరిత్ర ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మించిన ఈ సంస్థ కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉంది. అలా లాంగ్ గ్యాప్ తీసుకున్న ఏవీఎం ప్రొడక్షన్స్ సంస్థ.. త్వరలోనే మళ్లీ లైమ్ లైట్లోకి రాబోతోంది. ఈసారి సినిమాలు నిర్మించడంతో పాటు ఓటీటీకి ఒరిజినల్ కంటెంట్ అందించే పని కూడా స్టార్ట్ చేయబోతోంది.
ప్రస్తుతం ఈ సంస్థ ఓ తమిళ సినిమాకు, అదే విధంగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి ఓ తమిళ్ ఒరిజినల్ సినిమా అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే ఏవీఎం నుంచి ప్రకటన రాబోతోంది.
2014లో తీసిన ఓ తమిళ సినిమా తర్వాత మళ్లీ నిర్మాణ రంగంవైపు రాలేదు ఈ సంస్థ. ఇక తెలుగులో 2010లో వచ్చిన “లీడర్” సినిమా ఈ సంస్థకు చివరి చిత్రం. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి ఈ తరం రానా వరకు ఎంతోమంది హీరోలతో సినిమాలు నిర్మించిన ఏవీఎం స్టుడియోస్ సంస్థ, మళ్లీ ఎప్పుడు తెలుగులో సినిమా చేస్తుందో చూడాలి.
నటి ప్రీతి జింటా (Preity Zinta) కి ఇప్పుడు 50 ఏళ్ళు. ఆమె కూడా బాధితురాలు అంట. తన అనుమతి…
కెరీర్ లో ఎవరైనా ఒక పీరియడ్ సినిమా చేస్తారు, లేదంటే 2 చేస్తారు. కానీ కెరీర్ ప్రారంభించినప్పట్నుంచి వరుసగా అవే…
హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) తెగ హడావిడి చేస్తోంది. సినిమాకి ఎంత ప్రచారం చెయ్యాలన్నా చేస్తాను అన్నట్లు "నాగబంధం"…
ఈ దసరా పండక్కి (Dasara 2026) రెండు పెద్ద సినిమాలు పోటీ పడేలా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాకి అధికారికంగా…
మాళవిక మోహనన్ అంటేనే గ్లామర్ షో అని చెప్పాలి. ఆమె అందాల ఆరబోతలో అస్సలు సిగ్గుపడదు. ఇక ఇప్పుడు మాల్దీవుల్లో…
ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…