నాగార్జున, బాలకృష్ణ మధ్య ఉన్న అభిప్రాయబేధాల గురించి అందరికీ తెలిసిందే. ఒక దానిపై మరొకటి పేర్చినట్టు వరుస ఘటనలతో వీళ్లిద్దరి మధ్య దూరం పెరిగింది. బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్-స్టాపబుల్ కు చాలామంది హీరోలొచ్చారు గాని నాగ్ మాత్రం రాలేదు. ఇకపై కూడా రారు.
రీసెంట్ గా బాలయ్య 50 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. నాగార్జున మాత్రం రాలేదు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏ స్థాయిలో గొడవలున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి విషయాల్లో బాలయ్యకు పట్టింపులు మరింత ఎక్కువ. తనకు సంబంధం లేదనుకుంటే ఆయన అస్సలు మాట్లాడడు. అలాంటి వ్యక్తి నాగార్జునను లెజెండ్ గా అభివర్ణించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఐఫా అవార్డుల వేడుకలో పాల్గొన్నారు బాలయ్య. టాలీవుడ్ కు అందించిన సేవలకు గాను లెగసీ అవార్డ్ అందుకున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తో ఆయన కాసేపు మాట్లాడారు. సమకాలీకులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని ప్రశ్నించాడు కరణ్.
ముందుగా ఈ ప్రశ్నను స్కిప్ చేయాలనుకున్నాడు బాలకృష్ణ. టాపిక్ ను డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా.. బాలీవుడ్ ఖాన్ హీరోల్లో మీకు ఎవరంటే ఇష్టమని కరణ్ ను ప్రశ్నించాడు. వెంటనే కరణ్ తడుముకోకుండా తనకు షారూక్ అంటే ఇష్టమని చెప్పాడు. తిరిగి తన ప్రశ్నను రిపీట్ చేశాడు కరణ్. దీంతో బాలయ్య స్పందించక తప్పలేదు. తనకు ఎవరంటే ఇష్టమనే విషయాన్ని నేరుగా చెప్పకుండా.. తన సమకాలీకులైన నాగ్, చిరు, వెంకీ ముగ్గురూ లెజెండ్స్ అంటూ స్పందించాడు.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…