ఎం.ఎం. కీరవాణి గొప్ప సంగీత దర్శకుడు. ఏకంగా ఆస్కార్ కూడా అందుకున్నారు. ఆస్కార్ అందుకొన్న మొదటి తెలుగు వాడు ఆయన. ఐతే, కీరవాణి గత కొంతకాలంగా హిట్ సాంగ్స్ ఇవ్వలేకపోతున్నారు. ఈ తరానికి నచ్చే నాటు పాటలు కంపోజ్ చెయ్యడం లేదు అనేది ఫిర్యాదు. ఇటీవల విడుదలైన “హరి హర వీర మల్లు”లో ఒక్క పాట కూడా వైరల్ కాలేదు.
అందుకే మెగాస్టార్ చిరంజీవి భయపడినట్లు ఉన్నారు. “విశ్వంభర” సినిమాలో ఒక ఐటెం సాంగ్ కోసం వేరే సంగీత దర్శకుడిని తీసుకుంటున్నారట. కీరవాణి ఈ సినిమాకి పాటలు, నేపథ్య సంగీతం ఇస్తున్నారు. కానీ ప్రత్యేక గీతం కోసం ప్రత్యేకంగా వేరే సంగీత దర్శకుడికి బాధ్యతలు అప్పగించబోతున్నారట.
ఇటీవల మ్యాడ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి సూపర్ హిట్ మ్యూజికల్ ఆల్బమ్స్ ఇచ్చిన భీమ్స్ ఈ ‘విశ్వంభర’ సినిమా కోసం ఐటెం సాంగ్ కంపోజ్ చెయ్యబోతున్నారు.
ALSO READ: చిరుతో జాయిన్ అయిన నయనతార
అన్నట్లు ప్రస్తుతం చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న కొత్త సినిమాకి కూడా భీమ్స్ సంగీత దర్శకుడు.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…