ఎం.ఎం. కీరవాణి గొప్ప సంగీత దర్శకుడు. ఏకంగా ఆస్కార్ కూడా అందుకున్నారు. ఆస్కార్ అందుకొన్న మొదటి తెలుగు వాడు ఆయన. ఐతే, కీరవాణి గత కొంతకాలంగా హిట్ సాంగ్స్ ఇవ్వలేకపోతున్నారు. ఈ తరానికి నచ్చే నాటు పాటలు కంపోజ్ చెయ్యడం లేదు అనేది ఫిర్యాదు. ఇటీవల విడుదలైన “హరి హర వీర మల్లు”లో ఒక్క పాట కూడా వైరల్ కాలేదు.
అందుకే మెగాస్టార్ చిరంజీవి భయపడినట్లు ఉన్నారు. “విశ్వంభర” సినిమాలో ఒక ఐటెం సాంగ్ కోసం వేరే సంగీత దర్శకుడిని తీసుకుంటున్నారట. కీరవాణి ఈ సినిమాకి పాటలు, నేపథ్య సంగీతం ఇస్తున్నారు. కానీ ప్రత్యేక గీతం కోసం ప్రత్యేకంగా వేరే సంగీత దర్శకుడికి బాధ్యతలు అప్పగించబోతున్నారట.
ఇటీవల మ్యాడ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి సూపర్ హిట్ మ్యూజికల్ ఆల్బమ్స్ ఇచ్చిన భీమ్స్ ఈ ‘విశ్వంభర’ సినిమా కోసం ఐటెం సాంగ్ కంపోజ్ చెయ్యబోతున్నారు.
ALSO READ: చిరుతో జాయిన్ అయిన నయనతార
అన్నట్లు ప్రస్తుతం చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న కొత్త సినిమాకి కూడా భీమ్స్ సంగీత దర్శకుడు.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని "పెద్ది" సినిమాలో చూపించిన విధానం, ఆమె పాత్ర చిత్రీకరణ విషయంలో రేగిన గోల నేపథ్యంలో…
అందాల నిధి (Nidhhi Agerwal)కి పేరుకు తగ్గట్టుగానే అందాల గని ఉంది. కానీ ఆమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేదు.…