సుదీర్ఘ విరామం తర్వాత ‘విశ్వంభర’ మూవీ మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి చివరి షెడ్యూల్ మొదలుపెట్టారు. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో సినిమాకు సంబంధించి లాస్ట్ సాంగ్ షూట్ చేస్తున్నారు.
ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇదొక ప్రత్యేక గీతం. దీని కోసం బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ను తీసుకొచ్చారు. నాగినిగా ఈమె చాలా పాపులర్. ఇప్పుడు చిరంజీవి సినిమాతో సౌత్ లో కూడా పాపులర్ అవ్వబోతోంది.
ప్రస్తుచం చిరు, మౌనీ రాయ్ కాంబోలో సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు. గణేశ్ ఆచార్య ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే, భీమ్స్ ఈ పాటను స్వరపరిచాడు. నిజానికి ఈ సినిమాకు సంగీత దర్శకుడు కీరవాణి. కానీ ప్రత్యేక గీతాన్ని భీమ్స్ కు అప్పగించారు.
మరోవైపు ఈ సినిమా గ్రాఫిక్ వర్క్ జోరుగా సాగుతోంది. గ్రాఫిక్స్ పై దర్శకుడు వశిష్ఠ పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత విడుదల తేదీ ప్రకటిస్తారు.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…