జర్నలిస్ట్ పై దాడి ఘటనలో మోహన్ బాబుపై కేసు ఫైల్ అవ్వడంతో, ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తుది తీర్పును సోమవారానికి వాయిదావేసింది.
మధ్యంతర బెయిల్ రాకపోవడంతో మోహన్ బాబు పరార్ అయ్యారంటూ మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి. ఆల్రెడీ అతడు పరారైనట్టు గతంలోనే వార్తలు రాగా, వాటిని మోహన్ బాబు ఖండించారు. ఇంట్లోనే ఉంటూ, చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.
తాజాగా మరోసారి మోహన్ బాబు కనిపించడం లేదంటూ కథనాలు మొదలయ్యాయి. ఆయన దుబాయ్ కు పారిపోయారని కొంతమంది, తెలంగాణ పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆంధ్రాకు పారిపోయారని మరికొంతమంది చెప్పుకుంటున్నారు.
దీనిపై హైకోర్టు కూడా స్పందించింది. మోహన్ బాబు ఇక్కడే ఉన్నట్టు అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆ తర్వాతే తుది తీర్పు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు అరెస్ట్ అవుతారా అవ్వరా అనే క్లారిటీ సోమవారం వస్తుంది.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్తో అందరి…