సూపర్స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ద హంటర్’. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దసరా సీజన్ లో టాలీవుడ్ లో దేవర, వేట్టయన్ సినిమాలు మాత్రమే క్లిక్ అయ్యాయి. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.
దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమాను మరింత మందికి చేరువ చేసేందుకు టికెట్ రేట్లు తగ్గించారు. మల్టీ ప్లెక్సుల్లో రూ. 200, సిటీ సింగిల్ స్క్రీన్లలో రూ. 150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ. 110గా టికెట్ రేట్లను ఫిక్స్ చేశారు. తగ్గించిన టికెట్ రేట్లు రేపట్నుంచి అమల్లోకి వస్తున్నాయి.
ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహిద్ ఫాజల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుశారా విజయన్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించాడు.
ఇక ఈ సినిమాకి ప్రీక్వెల్ చేయాలని ఉంది అని అంటున్నారు దర్శకుడు టి.జె. జ్ఞానవేల్.
“జై భీమ్ తర్వాత సూర్యతో ఒక ప్రాజెక్ట్ లైన్లో ఉంది. కానీ రజనీకాంత్ గారితో పనిచేసే అవకాశం వచ్చింది. ‘జై భీమ్’ ఓ సెక్షన్ ఆడియెన్స్కి రీచ్ అయింది. రజినీకాంత్ సినిమా ఐతే అందరికీ చేరుతుంది నా ఆలోచన. అందుకే నేను ఓ యాభై శాతం వినోదం.. యాభై శాతం సందేశం ఉండాలని ఇలా కథను రాసుకున్నాను. అయినా నేను ఏ విషయంలోనూ రాజీ పడలేను. ఇక ఇప్పుడు అందరూ సీక్వెల్ తీస్తారా అని అడుగుతున్నారు. కానీ ప్రీక్వెల్ను చేయడానికి ఎక్కువ ఆసక్తితో ఉన్నాను. హీరో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఎలా అయ్యారనే కథను చెప్పాలని అనుకుంటున్నాను.”
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…