సూపర్స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ద హంటర్’. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దసరా సీజన్ లో టాలీవుడ్ లో దేవర, వేట్టయన్ సినిమాలు మాత్రమే క్లిక్ అయ్యాయి. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.
దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమాను మరింత మందికి చేరువ చేసేందుకు టికెట్ రేట్లు తగ్గించారు. మల్టీ ప్లెక్సుల్లో రూ. 200, సిటీ సింగిల్ స్క్రీన్లలో రూ. 150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ. 110గా టికెట్ రేట్లను ఫిక్స్ చేశారు. తగ్గించిన టికెట్ రేట్లు రేపట్నుంచి అమల్లోకి వస్తున్నాయి.
ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహిద్ ఫాజల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుశారా విజయన్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించాడు.
ఇక ఈ సినిమాకి ప్రీక్వెల్ చేయాలని ఉంది అని అంటున్నారు దర్శకుడు టి.జె. జ్ఞానవేల్.
“జై భీమ్ తర్వాత సూర్యతో ఒక ప్రాజెక్ట్ లైన్లో ఉంది. కానీ రజనీకాంత్ గారితో పనిచేసే అవకాశం వచ్చింది. ‘జై భీమ్’ ఓ సెక్షన్ ఆడియెన్స్కి రీచ్ అయింది. రజినీకాంత్ సినిమా ఐతే అందరికీ చేరుతుంది నా ఆలోచన. అందుకే నేను ఓ యాభై శాతం వినోదం.. యాభై శాతం సందేశం ఉండాలని ఇలా కథను రాసుకున్నాను. అయినా నేను ఏ విషయంలోనూ రాజీ పడలేను. ఇక ఇప్పుడు అందరూ సీక్వెల్ తీస్తారా అని అడుగుతున్నారు. కానీ ప్రీక్వెల్ను చేయడానికి ఎక్కువ ఆసక్తితో ఉన్నాను. హీరో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఎలా అయ్యారనే కథను చెప్పాలని అనుకుంటున్నాను.”
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…