హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. ఒకే రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 పెద్ద సినిమాల షూటింగ్స్ చేస్తున్నట్టు వెల్లడించింది.
“ఆర్టిస్ట్ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు మాత్రం నిజంగా గొప్పగా అనిపిస్తాయి. ఎంతో అదృష్టం ఉండాలి. ఒకే రోజు 2 పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాను. వీటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంటే, ఇంకోటి తెలంగాణలో నడుస్తోంది. ఒకే రోజు 2 రాష్ట్రాల్లో 2 సినిమాలు. ఈ రెండు సినిమాల్ని మీకు చూపించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. త్వరలోనే పండగ వస్తోంది.”
“హరిహర వీరమల్లు”, “రాజాసాబ్” సినిమాల్ని ఉద్దేశించి నిధి అగర్వాల్ ఈ పోస్ట్ పెట్టింది. విజయవాడ సమీపంలో వేసిన సెట్ లో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది నిధి. ఆ షెడ్యూల్ పూర్తయిన వెంటనే హైదరాబాద్ లో “రాజాసాబ్” షూట్ లొకేషన్ లో జాయిన్ అయింది.
మొన్నటివరకు ఈమె కేవలం “రాజాసాబ్” షూట్ లో మాత్రమే పాల్గొంది. ఎప్పుడైతే “హరిహర వీరమల్లు” సినిమా సెట్స్ పైకి వచ్చిందో, ఒక్కసారిగా బిజీ అయింది.
ఆమె అంకితభావానికి మారుతి లాంటి వాళ్లు ఫిదా అవుతున్నారు.
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…