“పెద్ది” (Peddi) సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. కానీ ఆ సినిమా విడుదలైన తర్వాత ఆమె సైలెంట్ అయిపొయింది. సినిమాలో తన పాత్ర చిత్రణ విషయంలో ఆమె ఫీల్ అయింది. దాంతో దర్శకుడు బుచ్చిబాబు సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాత సారీ చెప్పాడు.
అయినా ఆమె చలించలేదు. సినిమా విడుదల తర్వాత జాన్వీ కపూర్ ఎక్కడా దీని గురించి మాట్లాడలేదు. తన ఇన్ స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ పెట్టలేదు.
ఐతే తాజాగా అంటే నిన్న రాత్రి హైదరాబాద్ లో ఈ సినిమావిజయోత్సవ సంబరాలు జరిగాయి. రామ్ చరణ్ తో పాటు సుకుమార్, బుచ్చిబాబు, చిరంజీవి అంతా విచ్చేశారు. కానీ జాన్వీ కపూర్ డుమ్మా కొట్టింది.
ఇంతకీ ఆమెని ఈ ఈవెంట్ కి రమ్మని పిలిచారా అన్నది కూడా సందేహమే. పిలిచినా ఆమె వచ్చేదా అనేది కూడా డౌట్.
ఈ సినిమాలో ఆమె అచ్చియమ్మ అనే పాత్ర పోషించింది. ఈ పాత్ర విషయంలో జాన్వీ కపూర్ కన్నా దర్శకుడు బుచ్చిబాబు ఎక్కువ ట్రోలింగ్ పొందాడు. రిలీజ్ కి ముందు ఈ అమ్మడు ఈ సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకుని తెగ ప్రమోట్ చేసింది. కానీ రిలీజ్ అయిన తర్వాత ఆమెకి సీన్ అర్థమై ఈ టీంకి దూరం జరిగింది. ఆమెకి ఈ సినిమాకి ఏకంగా 8 కోట్ల పారితోషికం ఇచ్చారట.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…