ముంబయిలో ఎంతో ఇష్టపడి డిజైన్ చేయించుకున్న ఇంటిని నటి కమ్ ఎంపీ కంగనా రనౌత్ అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ, తమ లిస్టింగ్ లో ఈ ప్రాపర్టీని కొన్ని రోజుల కిందట సేల్ కు పెట్టింది. ఇప్పుడీ ప్రాపర్టీ అమ్మకం పూర్తయింది.
ముంబయిలోని పాలీ హిల్ బంగ్లాను ఆమె 32 కోట్ల రూపాయలకు విక్రయించింది. ఈ ప్రాపర్టీని ఆమె 2017లో 20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. 3075 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆవరించి ఉన్న ఈ ఇంట్లో, 565 చదరపు అడుగుల అదనపు పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది.
ఈ ప్రాపర్టీ అంటే కంగనాకు చాలా ఇష్టం. దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, చాలా ఏళ్ల కిందటే ఆమె ఇంటీరియర్ చేయించుకుంది. అంతేకాదు, ముందు భాగాన్ని తన ప్రొడక్షన్ హౌజ్ ఆఫీస్ గా కూడా మార్చుకుంది.
అయితే ఎంపీగా మారిన తర్వాత ఆ ప్రాపర్టీపై ఆమె పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. గతంలో ఇదే బంగ్లా కేంద్రంగా ముంబయి మహానగర పాలక సంస్థతో, కంగనా రనౌత్ కు గొడవ జరిగింది. కార్పొరేషన్ వాళ్లు సొంత భాగాన్ని కూలగొట్టారు కూడా. భవిష్యత్తులో అలాంటి వివాదాలు ఉండకుండా ప్రాపర్టీని ఆమె అమ్మేసింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…