ముంబయిలో ఎంతో ఇష్టపడి డిజైన్ చేయించుకున్న ఇంటిని నటి కమ్ ఎంపీ కంగనా రనౌత్ అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ, తమ లిస్టింగ్ లో ఈ ప్రాపర్టీని కొన్ని రోజుల కిందట సేల్ కు పెట్టింది. ఇప్పుడీ ప్రాపర్టీ అమ్మకం పూర్తయింది.
ముంబయిలోని పాలీ హిల్ బంగ్లాను ఆమె 32 కోట్ల రూపాయలకు విక్రయించింది. ఈ ప్రాపర్టీని ఆమె 2017లో 20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. 3075 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆవరించి ఉన్న ఈ ఇంట్లో, 565 చదరపు అడుగుల అదనపు పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది.
ఈ ప్రాపర్టీ అంటే కంగనాకు చాలా ఇష్టం. దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, చాలా ఏళ్ల కిందటే ఆమె ఇంటీరియర్ చేయించుకుంది. అంతేకాదు, ముందు భాగాన్ని తన ప్రొడక్షన్ హౌజ్ ఆఫీస్ గా కూడా మార్చుకుంది.
అయితే ఎంపీగా మారిన తర్వాత ఆ ప్రాపర్టీపై ఆమె పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. గతంలో ఇదే బంగ్లా కేంద్రంగా ముంబయి మహానగర పాలక సంస్థతో, కంగనా రనౌత్ కు గొడవ జరిగింది. కార్పొరేషన్ వాళ్లు సొంత భాగాన్ని కూలగొట్టారు కూడా. భవిష్యత్తులో అలాంటి వివాదాలు ఉండకుండా ప్రాపర్టీని ఆమె అమ్మేసింది.
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్మైషోలో…
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మూడు ఏరియాల్లో…
దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…
ధనుష్ (Dhanush) హీరోగా ఆర్ టేక్ స్టూడియోస్, వండర్బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘ఓం: చాప్టర్ 1’…
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…