కాయదు లోహర్… ఇటీవల కుర్రకారు కన్నుకి నచ్చిన సుందరి. తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన “రిటర్న్ ఆఫ్ డ్రాగన్” అనే చిత్రంలో నటించింది. అనుపమ ఒక హీరోయిన్ కాగా కాయదు లోహర్ మరో భామ. ఆమె అందచందాలు యువ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాయి. దాంతో ఆమెకి తమిళనాడులో క్రేజ్ వచ్చింది.
కాయదు ఇప్పుడు రెండో పెద్ద సినిమా ఒప్పుకొంది. శింబు హీరోగా రూపొందుతోన్న ఆయన 49వ చిత్రంలో కాయదు హీరోయిన్. ఈ సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభం అయింది. శింబు సరసన ఛాన్స్ రావడంతో ఆమెకి మరిన్ని బడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.
పాతికేళ్ల ఈ సుందరి మూడేళ్ళ క్రితం “అల్లూరి” అనే తెలుగు సినిమాలో నటించింది. శ్రీ విష్ణు హీరోగా నటించాడు అందులో. కానీ ఆ సినిమా ఆడలేదు. తెలుగు జనం కూడా ఆమెని పట్టించుకోలేదు. తమిళంలో నటించి క్రేజ్ తెచ్చుకొంది. ఇప్పుడు రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.
ఈ భామ తెలుగులో కూడా అవకాశాల కోసం చూస్తోంది. ఇప్పటికే మలయాళంలో రెండు సినిమాలు చేసింది.
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…
'పెద్ది' (Peddi) సినిమా వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్ జాన్వి కపూర్ (Janhvi Kapoor)ను అక్కడక్కడ అభ్యంతరకరంగా…
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…