కొన్ని సినిమాలు సడెన్ గా వార్తా మాధ్యమం నుంచి మాయమౌతాయి. ఆ తర్వాత ఉన్నఫలంగా ప్రత్యక్షమౌతుంటాయి. ఇది అలాంటి సినిమానే. సుహాస్-కీర్తిసురేష్ కాంబినేషన్ పై అప్పట్లో భలే చర్చ జరిగింది. కట్ చేస్తే, ఆ తర్వాత మాయమైంది. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్షమైంది. నేరుగా ఓటీటీలోకి వస్తోంది.
కీర్తి సురేష్, సుహాస్ కలిసి నటించిన కామెడీ డ్రామా ‘ఉప్పు కప్పురంబు’. ఈ సినిమా డైరక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 4న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ పెడుతున్నారు. స్మశాన వాటిక నేపథ్యంలో, విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన సినిమా ఇది. కీర్తిసురేష్ కు డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కొత్త కాదు, ఇంతకుముందు ఆమె నటించిన సినిమా ఒకటి ఇలానే డైరక్ట్ ఓటీటీలోకి వచ్చింది.
అయితే ఇక్కడ మేటర్ అది కాదు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత కీర్తిసురేష్ నుంచి తెలుగులో వస్తున్న సినిమా ఇది. ‘భోళాశంకర్’ డిజాస్టర్ తర్వాత కీర్తి మళ్లీ కనిపించలేదు. ఇప్పుడీ ‘ఉప్పు కప్పురంబు’తో ఆమె మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…
'పెద్ది' (Peddi) సినిమా వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్ జాన్వి కపూర్ (Janhvi Kapoor)ను అక్కడక్కడ అభ్యంతరకరంగా…
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…