దర్శకుడు క్రిష్ తాజా స్టేట్ మెంట్ ఇది. పవన్ కల్యాణ్ తో కచ్చితంగా మరో సినిమా చేస్తానంటున్నాడు ఈ డైరక్టర్. దీనికి కారణం అందరికీ తెలిసిందే.
‘హరిహర వీరమల్లు’ సినిమాను పవన్ తో మొదలుపెట్టాడు క్రిష్. కానీ సినిమా ఆలస్యమౌతుండడంతో, తప్పుకున్నాడు. అనుష్కతో ‘ఘాటీ’ సినిమా సెట్స్ పైకి వెళ్లాడు. ఆ తర్వాత ‘హరిహర వీరమల్లు’ను జ్యోతికృష్ణ హ్యాండిల్ చేశాడు. సినిమాను ముగించాడు, రిలీజ్ చేశాడు.
అయితే పవన్-క్రిష్ మధ్య అభిప్రాయబేధాలున్నాయని, వాళ్లిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరిందని కొంతమంది గాసిప్స్ అల్లారు. వీటిని పవన్ బహిరంగంగా తిప్పికొట్టారు. నిండు సభలో క్రిష్ ను మెచ్చుకున్నారు, అతడికి థ్యాంక్స్ కూడా చెప్పారు.
క్రిష్ కూడా పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. పవన్ తో తనకు ఎలాంటి విబేధాలు లేవని, అవకాశం వస్తే పవన్ తో మరో సినిమా చేస్తానని ప్రకటించాడు. ప్రస్తుతం ఆయన ‘ఘాటీ’ పనుల్లో బిజీ.
ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…