కియారా అద్వానీకి 30 ఏళ్ల తర్వాత ఒక ఆట గురించి తెలిసింది. అదీ కూడా పెళ్ళయిన తర్వాత ఆమె భర్త ఆ ఆటని ఆస్వాదించేలా చేశాడట. ఆ ఆట … టెన్నిస్.
ప్రస్తుతం 2024కి సంబంధించిన వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ (The Championships, Wimbledon 2024) జరుగుతోంది. ఈ ఆటని డైరెక్ట్ గా చూసేందుకు ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రా లండన్ వెళ్లారు. టెన్నిస్ గురించి అంతగా ఆసక్తి లేని కియారాని కూడా తోడుగా తీసుకెళ్ళడట. దాంతో ఈ భామ ఆటని ప్రత్యక్షంగా చూసి మురిసిపోతూ ఫోటోలు షేర్ చేసింది.
“నిజం చెప్తున్నా… ఇటీవల నా భర్త నాకు టెన్నిస్ పరిచయం చేశారు… ప్రత్యక్షంగా వింబుల్డన్ చూడడం మరిచిపోలేని అనుభవం. సెంటర్ కోర్ట్, స్ట్రాబెర్రీలు, ఐస్ క్రీమ్, అద్భుతమైన గేమ్ … వీటికన్నా మరో మధురమైన అనుభూతి ఏముంటుంది?,” అని చెప్పుకొచ్చింది ఈ భామ.
కియారా ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన “గేమ్ ఛేంజర్” సినిమాలో నటిస్తోంది. ఆమెకి ఇది తెలుగులో మూడో చిత్రం. హిందీలో ఆమె ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి. “డాన్ 3”, “వార్ 2” వంటి బడా సినిమాల్లో ఈ అమ్మడే హీరోయిన్.
ఇక కేజీఎఫ్ హీరో యష్ కొత్త సినిమాలో కూడా కియారా మెయిన్ హీరోయిన్. ఇలా పెద్ద సినిమాల్లో నటిస్తూ సరదాగా భర్తతో ఇలా వెకేషన్ కి వెళ్లి కొత్త ఆటని “నేర్చుకొంది.”
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని "పెద్ది" సినిమాలో చూపించిన విధానం, ఆమె పాత్ర చిత్రీకరణ విషయంలో రేగిన గోల నేపథ్యంలో…
అందాల నిధి (Nidhhi Agerwal)కి పేరుకు తగ్గట్టుగానే అందాల గని ఉంది. కానీ ఆమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేదు.…