ప్రతి హీరోకు మరో హీరోతో వింటేజ్ మూమెంట్ ఉంది. ఆది పినిశెట్టికి కూడా బాలకృష్ణతో అలాంటి మూమెంట్ ఒకటి ఉంది. స్వయంగా ఈ నటుడు, ఆ మేటర్ ను బయటపెట్టాడు.
బాలకృష్ణను తొలిసారి “బంగారు బుల్లోడు” సెట్స్ లో కలిశాడంట ఆది పినిశెట్టి. అప్పుడు తను చాలా చిన్నవాడినని, తండ్రితో కలిసి సెట్స్ కు వెళ్లానని చెప్పుకొచ్చాడు. తను చిన్నప్పుడు బాలయ్యలో చూసిన ఎనర్జీ, ఇప్పటికీ అలానే ఉందంటున్నాడు ఆది.
కెరీర్ లో ఫస్ట్ టైమ్ బాలకృష్ణతో కలిసి ‘అఖండ-2’ సినిమా చేస్తున్నాడు ఆది పినిశెట్టి. ఇందులో ఆయన ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. బాలయ్యతో కలిసి నటించడం చాలా బాగుందని, ఆయనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని చెప్పుకొచ్చాడు ఆది.
ఇక ‘అఖండ-2’ విషయానికొస్తే, ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తి చేశాడట ఆది పినిశెట్టి. త్వరలోనే తన షెడ్యూల్ ఉందని స్పష్టం చేశాడు. ‘ది వారియర్’ సినిమా తర్వాత ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న మూవీ ఇదే.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…