“హరి హర వీర మల్లు” సినిమాని దర్శకుడు క్రిష్ నాలుగేళ్ల క్రితం మొదలు పెట్టాడు. కానీ పవన్ కళ్యాణ్ రకరకాల కారణాల వల్ల, తన రాజకీయ కార్యకలాపాల వల్ల షూటింగ్ ని వాయిదా వేస్తూ వచ్చారు. దాంతో ఆ సినిమా అలా సాగుతూ వెళ్ళింది. ఈ క్రమంలో సినిమాని స్పీడ్ గా పూర్తి చేసేందుకు క్రిష్ ఒక ఐడియా వేశాడు. సినిమాని రెండు భాగాలుగా మార్చితే మొదటి భాగం త్వరగా పూర్తి చెయ్యొచ్చు అని అనుకున్నాడు. అయితే, క్రిష్, పవన్ కళ్యాణ్ కి కొన్ని విషయాల్లో విభేదాలు వచ్చాయి. దాంతో అతను తప్పుకున్నాడు.
క్రిష్ వదిలేసిన ప్రాజెక్టు ని ఎ.ఎం. రత్నం కొడుకు జ్యోతికృష్ణ పూర్తి చేశాడు. కొన్ని మార్పులు చేసి ఇప్పుడు విడుదలకు రెడీగా ఉంచాడు. ఈ నెల 24న విడుదల కానుంది ‘హరి హర వీర మల్లు – పార్ట్ 1’. మరి రెండో భాగం ఉంటుందా?
“ఉంటుంది. ఇప్పటికే 20 నిమిషాల షూటింగ్ పూర్తి అయింది,” అని హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్తోంది.
నిధి అగర్వాల్ మాట ఎలా ఉన్నా… రెండో భాగం పూర్తి కావాలంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు, ఆయన షెడ్యూల్స్ అవీ చాలా లెక్కలు వేసుకోవాలి. ఈ మొదటి భాగం పూర్తి చెయ్యడానికి నిర్మాత రత్నంకి చుక్కలు కనపడ్డాయి.
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…