ఉన్నట్టుండి సడెన్ గా వెలగపూడిలో ప్రత్యక్షమయ్యాడు సాయిదుర్గతేజ్. సెక్రటేరియట్ లోని తన ఆఫీస్ కు సాయిదుర్గతేజ్ ను ప్రత్యేకంగా పిలిపించాడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. దీనికి ఓ కారణం ఉంది.
సాయిదుర్గతేజ్ ఇండస్ట్రీకొచ్చి సరిగ్గా పదేళ్లు పూర్తయింది. అందుకే తన మేనల్లుడ్ని ప్రత్యేకంగా ఆఫీస్ కు పిలిపించుకొని అతడికి శుభాకాంక్షలు చెప్పి, ప్రత్యేకంగా సన్మానించారు పవన్ కల్యాణ్. తన ఛాంబర్ లోనే ఏర్పాటుచేసిన కొండపల్లి బొమ్మల స్టోర్ నుంచి కొన్నింటిని బహుమతుల రూపంలో సాయిదుర్గతేజ్ కు అందించారు.
పవన్ నుంచి సన్మానం అందుకున్న సాయిదుర్గతేజ్ చలించిపోయాడు. ముసిముసిగా నవ్వుతూనే, మామపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఎంతో భక్తితో కాళ్లకు నమస్కారం చేసి, ఆశీర్వాదం తీసుకున్నాడు.
ఈ ప్రత్యేక సందర్భం కలకాలం తన మనసులో నిలిచిపోతుందని ప్రకటించిన సాయిదుర్గతేజ్.. పవన్ ను తన గురువుగా చెప్పుకొచ్చాడు. పవన్, సాయిదుర్గతేజ్ మధ్య ఉన్న ఆఫ్ స్క్రీన్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ కలిసి ‘బ్రో’ అనే సినిమా కూడా చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…