ఉన్నట్టుండి సడెన్ గా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు విజయ్ దేవరకొండ. అంతేకాదు, ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. ఢిల్లీలో జరిగిన “వాట్ ఇండియా థింక్స్ టుడే” కార్యక్రమానికి విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. ఇదే వేదికపై తన కొత్త సినిమా ‘కింగ్ డమ్’ హిందీ ట్రయిలర్ ను ప్రసారం చేశారు.
ప్రధాని మోదీని కలవడం విజయ్ దేవరకొండకు ఇదే తొలిసారి. ఇన్నాళ్లూ తన హెయిర్ స్టయిల్ కనిపించకుండా టోపీ పెట్టుకొని కవర్ చేసిన దేవరకొండ, ఈ కార్యక్రమానికి మాత్రం టోపీ తీసి సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యాడు.
కాన్ క్లేవ్ లో మాట్లాడిన విజయ్, తన కెరీర్ గురించి, కొత్త సినిమాల విషయాల గురించి మాట్లాడాడు. ‘కింగ్ డమ్’ హిందీ వెర్షన్ కు రణబీర్ కపూర్ డబ్బింగ్ చెబుతారని ఈ సందర్భంగా ప్రకటించాడు విజయ్.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ‘కింగ్ డమ్’ సినిమా. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…