ప్రియాంక చోప్రాకి చాలా క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా భారీ పాన్ ఇండియన్, పాన్ వరల్డ్ చిత్రాలకు ఆమె మొదటి ఛాయిస్ గా మారింది. ఇప్పటికే రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్. హృతిక్ రోషన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న క్రిష్ 4 చిత్రంలో కూడా ఆమె హీరోయిన్.
అలాగే రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న “రామాయణం” సినిమాలో మొదట ప్రియాంకనే తీసుకోవాలనుకున్నారట. సూర్పనఖ పాత్రకు ప్రియాంకకి ఇవ్వాలనుకున్నారట. కానీ పారితోషికం ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకొని డ్రాప్ అయ్యారు మేకర్స్.
దాంతో, ఆ పాత్ర రకుల్ ప్రీత్ సింగ్ కి దక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ అలా ఒక భారీ సినిమాలో భాగం అయింది ఇప్పుడు. సూర్పనఖ పాత్ర రామాయణం కథకి కీలకం. ప్రియాంక భారీ పారితోషికం డిమాండ్ రకుల్ కి అలా కలిసొచ్చింది.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం సినిమాకి 20 నుంచి 30 కోట్ల మధ్య తీసుకుంటోంది. పాత్ర, ఆ సినిమా బడ్జెట్ ని బట్టి ఆమె పారితోషికం డిసైడ్ అవుతుంది. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ ఆమెనే.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…